తుంగభద్ర డ్యామ్ గేటు పరిశీలనకు మంత్రి నిమ్మల రామానాయుడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 11:34 AM IST
Minister Nimmala Ramanaidu Visit Tungabhadra Dam : సీఎం చంద్రబాబు ఆదేశాలతో కర్నాటకలో కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు పరిశీలనకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్లనున్నారు. మంత్రితోపాటు జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ తదితరులు హాస్పేట్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో డ్యామ్ గేటు కొట్టుకుపోయిన స్థానంలో చేపట్టనున్న మరమ్మతులపై ఇంజనీరింగ్ నిపుణులు, గేటు అమర్చే నిపుణులతో మంత్రి రామానాయుడు సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.