national

తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.5కోట్ల విరాళం అందజేసిన మేఘా సంస్థ

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 10:39 PM IST

MEIL Donates Rs 5 Crore To TG CMRF
MEIL Donates Rs 5 Crore To TG CMRF (ETV Bharat)

MEIL Donates Rs 5 Crore To TG CMRF : రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. వరద సహాయక చర్యల కోసం మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి సీఎం రేవంత్​రెడ్డికి రూ.5కోట్ల రూపాయల చెక్కు అందజేశారు. హైదరాబాద్‌ రేస్ క్లబ్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసంలో రూ.2 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసింది. లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌ సీఎంఆర్‌ఎఫ్‌కు కోటి రూపాయలు విరాళం అందజేశారు. మైత్రా ఎనర్జీ గ్రూప్, అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్, రవి కైలాస్ కోటి రూపాయలు రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details