Published : 6 hours ago
ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి కాసుల వర్షం- 9999 నంబరుకు రూ.20 లక్షలు
Khairatabad RTO Office : ఫ్యాన్సీ నంబర్లతో రాష్ట్ర రవాణా శాఖకు కాసుల వర్షం కురుస్తోంది. 9999 నంబరుకు ఏకంగా రూ.20 లక్షల ధర పలికింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో సోమవారం టీజీ 09బీ సిరీస్ పూర్తయ్యి, టీజీ 09సీ సిరీస్లోకి చేరింది. ఫ్యాన్సీ నంబర్ల వేలం పాడగా ఒకే రోజు రూ.47,12,265 లక్షల రాబడి వచ్చిందని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. బీ సిరీస్ ముగింపు నంబరు టీజీ 09బీ 9999ను లాట్ మొబైల్స్ సంస్థ రూ.20,01,111 లక్షలకు సొంతం చేసుకుంది. ఇదే సిరీస్లో టీజీ 09బీ 9909 నంబరును మేధా విస్టారిన్ సంస్థ రూ.1.35 లక్షలకు దక్కించుకుంది. కొత్త సిరీస్లో మొదటి నంబరు 09 సీ 0001ను యోధ్స్టోర్ రూ.10,27,777లక్షలు, 0006 పోరస్ ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ రూ.3.85 లక్షలు, 0009 దండు ఎనర్జీ రూ.2.75లక్షలు, 0007 సుబ్బాయమ్మ వెంపటి రూ.1,77,777లక్షలకు పొందినట్లు అధికారులు వెల్లడించారు.