national

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 2:42 PM IST

ETV Bharat / snippets

పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత - ఘటనను సీరియస్​గా తీసుకున్న ప్రభుత్వం

High Tension At Pocharam House
High Tension At Pocharam House (ETV Bharat)

High Tension At Pocharam House :మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద జరిగిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఉండగానే బీఆర్ఎస్​ నేతలు చొచ్చుకురావడం కలకలం రేపింది. వారిని ఎందుకు అడ్డుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.

ఘటనను తీవ్రంగా పరిగణించిన పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్, సీఎం ముఖ్య భద్రతాధికారి గుమ్మి చక్రవర్తి అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీడియోలను చూసి ఏం జరిగిందన్న విషయమై ఆరా తీశారు. లోపలికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారని పోలీసులను ప్రశ్నించారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details