వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ - 3 వారాలకు వాయిదా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 3:26 PM IST
High Court on YSRCP Leader Subba Reddy Petition: తనకు 2+2 గన్మెన్ను కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ సమాచారం లేకుండా గన్మెన్లను ప్రభుత్వం తొలగించిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల తర్వాత 2+2 కల్పించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ పరిశీలనలో సుబ్బారెడ్డి ప్రాణహాని లేదని చెప్పినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ సమయం కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.