పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - పలు రైళ్లకు అంతరాయం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 12:08 PM IST
GOODS TRAIN DERAILED AT BITRAGUNTA: నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎగువ నుంచి యార్డులోకి వస్తుండగా రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. బోగోలు వద్ద రైల్వే గేటు మూసివేత కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనస్థలికి చేరుకున్నారు. అత్యవసర రైళ్లను మరో లైన్లో పంపాలని అధికారులు నిర్ణయించారు.