national

దాహమంటూ మెడలో చైన్ లాక్కెల్లాడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 1:31 PM IST

GOLD CHINE CHORI
మంచినీళ్లు కావాలంటూ - బంగారు గొలుసు లాక్కెల్లిన దుండగుడు (ETV Bharat)

Gold Chine Chori in Palasa at Srikakulam District :శ్రీకాకుళం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లో చొరబడి మహిళ మెడలోని బంగారం గొలుసు ఎత్తుకుపోయాడు. పలాసలో కృష్ణవేణి, విష్ణుమూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. విష్ణుమూర్తి లేని సమయంలో తాగునీరు కావాలంటూ ఓ యువకుడు బాధితుల ఇంటికి వెళ్లాడు. కృష్ణవేణి తాగునీరు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్తున్న సమయంలో వెనుకాలే వెళ్లి ఆమె మెడలోని గొలుసు లాక్కొని దుండగుడు పారిపోయాడు. చోరీకి గురైన బంగారం నాలుగు తులాలని బాధితురాలు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details