హబ్సిగూడలో దారుణం - లారీ ఢీకొని 6వ తరగతి విద్యార్థిని మృతి
Published : Aug 29, 2024, 10:29 PM IST
|Updated : Aug 29, 2024, 10:35 PM IST
Girl Died In Road Accident In Hyderabad : హబ్సిగూడలో గురువారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద లారీ ఢీకొని స్కూల్ విద్యార్థిని మృతి చెందింది. జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఓయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.