national

ETV Bharat / snippets

వాగులో స్నానానికి దిగి నలుగురు యువకులు గల్లంతు, ఇద్దరు మృతి - మరో ఇద్దరు మిస్సింగ్

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 3:27 PM IST

Nallamada river Incident Today
Four Youths Drowned in river (ETV Bharat)

Four Youths Drowned in river at Bapatla District :ఆంధ్రప్రదేశ్​లోనిబాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​ నుంచి సూర్యలంక బీచ్​కు ఇవాళ ఉదయం వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు.

తొలుత ప్రవాహ ఉద్ధృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సునీల్‌, సన్నీ మృతదేహాలు గుర్తించి వెలికి తీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details