ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ ఎమ్మెల్యే రాజయ్య
Published : May 28, 2024, 5:20 PM IST
EX MLA Rajaiah Missing Vote in MLC BY Election : ఈ నెల 27న జరిగిన వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉపఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. తనతో పాటు తన కుటుంబంలో ఉన్న మరో ఏడుగురి ఓట్లు వేయలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటరు ఎన్రోల్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఓటు గల్లంతయిందని పేర్కొన్నారు. ప్రతిసారిలాగానే రెన్యువల్ అయ్యాయని అనుకున్నామని, ఎన్రోల్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఓటు వేయలేకపోయామని అసహనం వ్యక్తం చేశారు. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామని, మొదటిసారి తమ ఇంట్లో ఓట్లు వేయలేకపోయామని రాజయ్య తెలిపారు.