national

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ ఎమ్మెల్యే రాజయ్య

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 5:20 PM IST

EX MLA Rajaiah Missing Vote
Telangana MLC Elections 2024 (ETV Bharat)

EX MLA Rajaiah Missing Vote in MLC BY Election : ఈ నెల 27న జరిగిన వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉపఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని స్టేషన్​ ఘన్​పూర్​ మాజీ ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. తనతో పాటు తన కుటుంబంలో ఉన్న మరో ఏడుగురి ఓట్లు వేయలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటరు ఎన్​రోల్​మెంట్​ చేసుకోకపోవడం వల్ల ఓటు గల్లంతయిందని పేర్కొన్నారు. ప్రతిసారిలాగానే రెన్యువల్​ అయ్యాయని అనుకున్నామని, ఎన్​రోల్​మెంట్​ చేసుకోకపోవడం వల్ల ఓటు వేయలేకపోయామని అసహనం వ్యక్తం చేశారు. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామని, మొదటిసారి తమ ఇంట్లో ఓట్లు వేయలేకపోయామని రాజయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details