శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు- భయంతో జనం పరుగులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 12:22 PM IST
Ichchapuram Earthquake :శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. బుధవారం వేకువజామున మూడున్నర సమయంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2 సెకండ్ల పాటు దద్దరిల్లిన శబ్దాలు, ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.2గా నమోదైంది. అయితే భూకంప తీవ్రత స్వల్ప స్థాయిలో ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వివరించారు.