national

వరద బాధితులకు దివీస్ చేయూత - లక్షన్నర మందికి అల్ఫాహారం, భోజనాలు పంపిణీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 5:12 PM IST

Divis Help to People in Flooded Area at Vijayawada
Divis Help to People in Flooded Area at Vijayawada (ETV Bharat)

Divis Help to People in Flooded Area at Vijayawada :వరద ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్న విజయవాడ ముంప బాధితులకు తక్షణ అవసరాలు తీర్చేందుకు దీవిస్‌ సంస్థ ముందుకొచ్చింది. అనేక కాలనీల్లో భోజనాలు, అల్ఫాహారం అందించేంచాలని నిర్ణయించారు. ప్రతి రోజూ 1,70,000మందికి అల్పాహారం, భోజనాలను అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ద్వారా అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం సూచించిన ముంపు కాలనీలు, ప్రాంతాల్లో ఇవాళ నుంచే అందిస్తున్నామని దివీస్‌ సంస్థ ఎండీ మురళీ కృష్ణ దివి తెలిపారు. మూడు పూటల రానున్న ఐదు రోజుల పాటు అవసరమైన మేరకు భోజన ఏర్పాట్లు చేస్తామని మురళీ కృష్ణ చెప్పారు. ఇందుకు సమారు రెండున్న కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. విపత్కర సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు దివీస్‌ సంస్థ ముందుకు రావడంపై హరే కృష్ణ మూవ్‌మెంట్‌, అక్షయపాత్ర ప్రతినిధి శ్రీమాన్‌ వంశధార దాసు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details