Published : Aug 13, 2024, 10:17 PM IST
సెప్టెంబర్ రెండో వారంలోగా ఆర్ఆర్ఆర్ భూసేకరణ పూర్తి చేయాలి : సీఎస్ శాంతికుమారి
CS Review On Regional Ring Road In Hyderabad: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు కోసం అవసరమైన భూసేకరణను సెప్టెంబరు రెండో వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పురోగతిపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు చట్టపరమైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయి కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి భూముల మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందేలా చూడాలని చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు.