national

తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం - చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు రేవంత్​ అభినందనలు

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 8:00 PM IST

CM Revanth Reacts to AP Elections
CM Revanth Wishes to Chandrababu, Pawan Kalyan (ETV Bharat)

CM Revanth Wishes to Chandrababu, Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్​ శాసనసభ ఎన్నికల సమరంలో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం కైవసం చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి స్పందించారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్​ కల్యాణ్​లకు సీఎం రేవంత్​ శుభాకాంక్షలు తెలిపారు.​ ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతిపథంలో పయనించాలని సీఎం ఆకాంక్షించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని, సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details