ETV Bharat / snippets

కిడ్నాప్ చేసి షేర్ల బదలాయింపు - రాధాకిషన్​రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 4:09 PM IST

Radhakishan Rao
Radhakishan Rao (ETV Bharat)

Radha kishan Rao Arrested in Another Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టై, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును మరో కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎస్‌లో నమోదైన ఓ కేసులో పీటీ వారెంట్‌పై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

చెన్నుపాటి వేణుమాధవ్‌ అనే వ్యక్తి గతంలో రాధాకిషన్‌రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్‌ తనను కిడ్నాప్‌ చేసి షేర్లు బదలాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రియా హెల్త్‌కేర్‌ షేర్లను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. వేణుమాధవ్‌ ఫిర్యాదుతో రాధాకిషన్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఈయనతో పాటు మరో ఇద్దరు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లపైనా కేసు నమోదు చేశారు.

Radha kishan Rao Arrested in Another Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టై, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును మరో కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎస్‌లో నమోదైన ఓ కేసులో పీటీ వారెంట్‌పై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

చెన్నుపాటి వేణుమాధవ్‌ అనే వ్యక్తి గతంలో రాధాకిషన్‌రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్‌ తనను కిడ్నాప్‌ చేసి షేర్లు బదలాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రియా హెల్త్‌కేర్‌ షేర్లను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. వేణుమాధవ్‌ ఫిర్యాదుతో రాధాకిషన్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఈయనతో పాటు మరో ఇద్దరు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లపైనా కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.