కామారెడ్డి జిల్లాలో ఎలుగు బంటి సంచారం - భయాందోళనలో స్థానికులు
Published : May 25, 2024, 2:32 PM IST
Bear spotted in kamareddy District : కామారెడ్డి జిల్లాలో ఎలుగు బంటి సంచారం వాహనదారుల్లో భయం పుట్టిస్తోంది. లింగంపేట మండలం మేంగారం -బోనాల గ్రామాల మధ్య రోడ్డుపై ఎలుగుబంటి సంచరించింది. గత రెండు రోజుల కింద అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి మేంగారం రోడ్డు నుంచి గాంధారి రోడ్డు వైపు సంచరిస్తుందని వాహనదారులు అంటున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేందుకు భయాందోళకు గురవుతున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను ఫోన్లలో బంధించారు. ఎలుగుబంటి కోసం బోన్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి కోసం ఎలుగుబంటి అటవీ నుంచి రోడ్డుపైకి వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.