వయనాడ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయం - రూ. 10 కోట్లు విరాళం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 8:05 AM IST
AP Government Donates 10 Crore To Kerala For Wayanad Victims:కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రకృతి విలయంతో అల్లాడుతోన్న వారి కోసం 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ పది కోట్ల రూపాయలను కేరళకు అందించనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేరళ వరద బాధితులు త్వరితగతిన కోలుకునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.