national

వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమోలు - ప్రతిరోజు వచ్చి సంతకం చేయాలని డీజీపీ ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 2:27 PM IST

AP DGP Orders To Waiting IPS Officers
AP DGP Orders To Waiting IPS Officers (ETV Bharat)

AP DGP Orders To Waiting IPS Officers : రాష్ట్రంలో వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. రోజూ హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని వారికి మెమోలు ఇచ్చారు. పీఎస్సార్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌ సహా 16 మందికి మెమోలు జారీ చేశారు. సంజయ్, కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్నీ, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజులకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. రోజూ హెడ్‌ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details