50 Grams Gold in Rice Bag: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని సముద్రాల గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కట్ల సోమలక్ష్మి అనే వృద్ధురాలు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం సంచిలో ఐదు తులాల బంగారం దాచి పెట్టింది. గ్రామంలోని ఓ వ్యక్తికి ఆ బియ్యాన్ని విక్రయించింది. బంగారం దాచుకున్న సంచి వేరే ఉందని భావించి, అందులో చూడగా బంగారం కనిపించలేదు.
పోయిందనుకున్న బంగారం మళ్లీ దక్కింది.. ఎలాగంటే
Published : 4 hours ago
GOLD ISSUE IN JANAGAON DISTRICT (ETV Bharat)
బంగారం దాచిన బియ్యం సంచినే విక్రయించినట్లు తెలుసుకుని విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. మరుసటి రోజు బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా గ్రామంలోని ఓ చోట 15 బస్తాల వరకు బియ్యాన్ని నిలువ చేసినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యుల సహాయంతో బియ్యం సంచులను విప్పి వెతకగా అందులో బంగారం దొరికింది. దీంతో వృద్ధురాలు సోమలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.