national

టీ20 ఫైనల్​@5.3కోట్లు- భారత్​ సెలబ్రేషన్స్​ను కూడా ఎవరూ మిస్ కాలేదుగా!

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 6:51 PM IST

Associated Press
Associated Press (Associated Press)

అప్పటి వరకు గెలుస్తుందనే నమ్మకం- ఒక్కసారిగా అంతా ఛేంజ్- క్షణక్షణం ఉత్కంఠ- చివరకు యావత్ భారతావని గర్వించేలా టీ20 వరల్డ్ కప్ కైవసం- మ్యాచ్ తర్వాత క్రికెటర్ల ఎమోషన్స్- గెలుపు సంబరాలు- ఈ మూమెంట్స్​ను అందరూ శనివారం రాత్రి ఆస్వాదించిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్​స్టార్ లో భారత్, సౌతాఫ్రికా మ్యాచ్​ను గరిష్ఠంగా 5.3 కోట్ల మంది క్రికెట్ లవర్స్ వీక్షించారు.

గతేడాది నవంబర్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను హైయెస్ట్ గా 5.9 కోట్ల మంది చూడగా, ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉంది. టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్‌ను అత్యధికంగా 3.9 కోట్లు వచ్చాయి. ఫైనల్​ను అత్యధికంగా 5.3 కోట్ల మంది చూడగా, మ్యాచ్ తర్వాత జరిగిన సెలబ్రేషన్స్​ను 2.5 నుంచి 3 కోట్ల మంది చూశారు.

ABOUT THE AUTHOR

...view details