national

ETV Bharat / snippets

క్రికెట్​కు డేవిడ్ వీస్ గుడ్​బై- అదే లాస్ట్ మ్యాచ్

david wiese retirement
david wiese retirement (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 1:10 PM IST

David Wiese Retirement:సౌతాఫ్రికా, నమీబియా జట్ల స్టార్ ప్లేయర్ డేవిడ్ వీస్ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 టీ20 ప్రపంచకప్​లో నమీబియా- ఇంగ్లాండ్ మ్యాచ్ అనంతరం వీస్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మ్యాచ్​లో వీస్ 1 వికెట్ పడగొట్టాడు. అయితే సౌతాఫ్రికాలో పుట్టిన వీస్, 2013లో అదే దేశం తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2021లో సౌతాఫ్రికాను వీడి తన తండ్రి స్వదేశమైన నమీబియా జట్టుతో చేరాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్​లో నమీబియాకు 2021, 2022 ఐసీసీ టోర్నీల్లో కీలక ప్లేయర్​గా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ కెరీర్​లో రెండు దేశాలకు కలిపి 15 వన్డేలు, 54 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 330 పరుగులు, 15 వికెట్లు తీయగా, టీ20ల్లో 624 పరుగులు, 59 వికెట్లు పడగొట్టాడు. ఇటు ఐపీఎల్​లోనూ వీస్ కోల్​కతా, బెంగళూరు జట్ల తరపున ఆడాడు. ఆదివారం ఇంగ్లాండ్​తో మ్యాచే వీస్​కు ఆఖరి ఇంటర్నేషనల్ గేమ్.

ABOUT THE AUTHOR

...view details