national

ETV Bharat / snippets

ఎంతైనా ఛాంపియన్లు ఛాంపియన్లే!: సికిందర్ రజా

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 8:46 AM IST

Updated : Jul 8, 2024, 10:28 AM IST

Ind Vs Zim 2nd T20
Ind Vs Zim 2nd T20 (Source: Associated Press)

Ind vs Zim 2nd T20:జింబాబ్వే పర్యటనలో టీమ్ఇండియా రెండో టీ20లో భారీ విజయం సాధించింది. తొలి టీ20లో 102 పరుగులకే కుప్పకూలి ఓడిన టీమ్ఇండియా రెండో మ్యాచ్​లో అద్భుతంగా పుంజుకొని 100 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అయితే ఓటమిని అంగీకరిస్తూ జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మ్యాచ్ అనంతంరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఛాంపియన్లు చివరికి ఛాంపియన్లలాగే ఆడతారని అన్నాడు.

'వరల్డ్ ఛాంపియన్లు చివరికి ఛాంపియన్లలాగే ఆడతారు. క్యాచ్​లు జారవిడచడం వల్ల మ్యాచ్ చేజారింది. ఈ వికెట్​పై 200 పరుగులు సాధ్యమే అనుకున్నా. కానీ, వాళ్లు మరో 30 పరుగులు అదనంగా సాధించారు. ఇక ఛేదనలో కూడా మేం అనుకున్నంత రేంజ్​లో రాణించలేపోయాం' అని సికిందర్ రజా అన్నాడు. కాగా, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 234-2 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది.

Last Updated : Jul 8, 2024, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details