YSRCP MLCs Resign : ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారని సమాచారం. ఎమ్మెల్సీ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా వారు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఎంపీల బాటలోనే ఎమ్మెల్సీలు - త్వరలోనే వైఎస్సార్సీపీ నుంచి మరో రెండు వికెట్లు డౌన్!
Published : Aug 30, 2024, 4:48 PM IST
YSRCP MLCs Resign (ETV Bharat)
మరో ఆరుగురు వైఎస్సార్సీపీ ఎంపీలు కూడా తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ 8 మందిలో నలుగురు టీడీపీ వైపు, మరో నలుగురు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. తొలి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు టీడీపీ, వ్యాపారవర్గాల నుంచి వచ్చినవారు బీజేపీవైపు వెళ్లవచ్చని అంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.