national

'రాష్ట్రం నుంచి సమర్థుడైన నాయకుడు ఒక్కరు దొరకలేదా' - రాజ్యసభకు మను సింఘ్వీ ఎంపికపై కేటీఆర్

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 9:40 AM IST

KTR Comments On Congress
KTR Comments On Congress (ETV Bharat)

KTR Comments On Congress :తెలంగాణ నుంచి రాజ్యసభకు సీనియర్‌ నేత మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడంపై మాజీమంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రాష్ట్రం నుంచి సమర్థుడైన ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్‌కు దొరకలేదా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. దిల్లీ బాసుల ఆదేశాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తోలుబొమ్మల్లాగా కట్టుబడి ఉన్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనుండగా తెలంగాణ నుంచి కె. కేశవరావు స్థానంలో దిల్లీ నేత అభిషేక్‌ మను సింగ్వీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతోంది

ABOUT THE AUTHOR

...view details