భారత్లో తొలి విదేశీ విశ్వవిద్యాలయం - క్యాంపస్ ఎక్కడంటే?
Published : Aug 29, 2024, 8:13 PM IST
UK University Campus In India: భారత్లో బ్రిటన్కు చెందిన సౌథాంప్టన్ యూనివర్సిటీ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ విద్యావిధానం(ఎన్పీఈ) కింద భారత్లో క్యాంపస్ ఏర్పాటు చేయనున్న తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఇదేనని విదేశాంగ శాఖామంత్రి జైశంకర్ తెలిపారు. ఈ క్యాంపస్ను హరియాణాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేసేందుకు సౌథాంప్టన్ యూనివర్సిటీ చేసిన ప్రతిపాదలను యూజీసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించిందని ఎక్స్ వేదికగా జైశంకర్ తెలిపారు. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ఓఐ)ని యూనివర్సిటీ ప్రతినిధులకు అందజేసినట్లు పేర్కొన్నారు. 2025 జూలై నుంచి కోర్సులు అందుబాటులోకి రానున్నాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ప్రధానంగా బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్, లా, ఇంజినీరింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్కు సంబంధించిన కోర్సులు ఉంటాయన్నారు. సౌథాంప్టన్ 'ఇండియా క్యాంపస్' అందించే డిగ్రీలు హోస్ట్ యూనివర్శిటీలో ఉన్నట్లే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.