Priyanka Gandhi Nomination :కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్కు ముందు ప్రియాంక గాంధీ పార్టీ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
వయనాడ్లో బుధవారం ప్రియాంక నామినేషన్- సోనియా, రాహుల్ హాజరు
Published : Oct 21, 2024, 4:23 PM IST
2024 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాయ్బరేలీ సీటును తన వద్దే ఉంచుకుని, వయనాడ్ ఎంపీగా రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీని యూడీఎఫ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఝార్ఖండ్ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్తో పాటు వయనాడ్ పార్లమెంట్ స్థానం, 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.