national

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 4:54 PM IST

ETV Bharat / snippets

నడిరోడ్డుపై యువతిని కొట్టి చంపిన ప్రియుడు- పోలీసులు వచ్చే వరకు మృతదేహం వద్దే!

Maharastra Murder
Maharastra Murder (ETV Bharat)

Maharastra Murder Case :మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై 20ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ఇండస్ట్రియల్​ స్పానర్‌తో తలపై కొట్టి ప్రాణాలు తీశాడు. చుట్టూ జనం ఉన్నా కూడా ఏ ఒక్కరూ ఆ నిందితుడిని అడ్డుకునేందుకు సాహసించలేదు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని రోహిత్‌ యాదవ్‌గా గుర్తించారు. ఆరేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, యువతికి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ నిందితుడు ఆమెను తరచూ వేధించినట్లు సమాచారం. స్థానిక పారిశ్రామిక వాడలో పనిచేసేందుకు ఇద్దరు కలిసి వెళ్తున్న సమయంలో అదే విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. కోపోద్రిక్తుడైన రోహిత్, పని కోసం తెచ్చుకున్న స్పానర్‌తో ఆ ఆయువతి తలపై పలుమార్లు గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేంత వరకు, రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహం వద్దే నిందితుడు కూర్చుండిపోయాడు.

ABOUT THE AUTHOR

...view details