బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీకి అస్వస్థత- ఆస్పత్రికి తరలింపు
Published : Jun 27, 2024, 6:22 AM IST
LK Advani AIIMS :బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి హుటాహుటిన ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. 96ఏళ్ల ఆడ్వాణీకి యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఎల్కే ఆడ్వాణీ అస్వస్థతకు గల కారణం తెలియాల్సి ఉంది.