ప్రభుత్వ పాఠశాలలో ఏసీ క్లాస్రూమ్స్- స్టూడెంట్స్ ఫుల్ ఖుష్- టీచర్లే చందాలు వేసుకుని!
Published : Jun 30, 2024, 11:10 AM IST
![ప్రభుత్వ పాఠశాలలో ఏసీ క్లాస్రూమ్స్- స్టూడెంట్స్ ఫుల్ ఖుష్- టీచర్లే చందాలు వేసుకుని! AC Classrooms In Government School](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/1200-675-21831211-thumbnail-16x9-ac-classrooms.jpg)
AC Classrooms In Government School :ప్రభుత్వ పాఠశాలలో ఏసీ క్లాస్రూమ్లు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమే. బంగాల్ ముషీరాబాద్ జిల్లా కందిలో ఉన్న రాషోర అంబికా హైస్కూల్లో విద్యార్థుల కోసం క్లాస్రూమ్ల్లో ఏసీలు అమర్చారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా క్లాస్రూమ్ల్లో వేడికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు పడిపోయింది. రోజురోజుకు ఈ సంఖ్య పెరగడం వల్ల, దీన్ని ఆపేందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు నడుం బిగించారు. ఈ మేరకు స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్ కలిసి సమావేశాలు నిర్వహించి, చివరకు క్లాస్రూమ్ల్లో ఏసీలు బిగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కంది మున్సిపాలిటీ ఛైర్మన్, స్థానిక MLA కూడా ఓకే చెప్పారు. టీచర్ల చందా, విరాళాలతో రూ.3.75లక్షల ఖర్చు చేసి 8ఏసీలు కొన్నారు. తమ ప్రయత్నం విజయవంతమైందని, స్టూడెంట్స్ స్కూల్ వస్తున్నారని, సిలబస్ సకాలంలో పూర్తి చేస్తామని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.