ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 7:44 PM IST

ETV Bharat / videos

మహాత్మాగాంధీ విగ్రహానికి వైసీపీ జెండాలు కట్టిన కార్యకర్తలు - ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు

YSRCP Flags to Mahatma Gandhi Statue: ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల తీరుపై స్థానికులు మండిపడ్డారు. వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శలకు దిగారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గడేహోతూరులో మహాత్మాగాంధీ విగ్రహానికి (Mahatma Gandhi Statue) వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుచరులు వైసీపీ జండాలను కట్టారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి విశ్వన్న కార్యక్రమాన్ని విశ్వేశ్వరరెడ్డి నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహాత్మాగాంధీ విగ్రహనికి వైసీపీ జెండాలు కట్టారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలు నియోజకవర్గాల్లో తాయిలాలు పంచుతూ వైసీపీ నాయకులు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. దీనిపై సైతం ఇప్పటికే పలువురు ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

ABOUT THE AUTHOR

...view details