ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నెల్లూరు జిల్లాలో పులుల సంచారం- భయంతో వణికిపోతున్న స్థానికులు - Tigers Migration

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 4:31 PM IST

Two Tigers Migration in Velugonda Forests: నెల్లూరు జిల్లా మర్రిపాడు- వెలుగొండ అడవుల్లో సంచరిస్తున్న రెండు పులులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. వెలుగొండ అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పెద్దపులి, చిరుత పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లొద్దంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. పులుల సంచారంతో జిల్లా సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసిన పులి గురించే చర్చించుకుంటున్నారు. ఏ సమయంలో ఎటువైపు నుంచి పులి వచ్చి దాడి చేస్తుందేమోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 

పులుల సంచారంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సాధారణంగా పులులు తన పరిధిని 25 నుంచి 50 కిలోమీటర్లు వరకు విస్తరించుకుంటాయి. సంతానోత్పత్తి కోసం వాటి పరిధి నుంచి బయటకు వస్తాయి. ఆహారం, నీటి కోసం సరిహద్దు గ్రామాలవైపు వస్తుంటాయి.

ABOUT THE AUTHOR

...view details