ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు బైక్​లను ఢీకొట్టిన లారీ- ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - Two people died on road accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 3:49 PM IST

Two People Died on Road Accident in Annamayya District (ETV Bharat)

Two People Died on Road Accident in Annamayya District : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న రెండు బైక్​లను ట్రాలీ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట క్రాస్ రోడ్డు వద్ద సంభవించింది. వివరాల్లోకి వెళ్తే, మంగంపేటకు చెందిన సుబ్బయ్య, సిద్దేశ్వర్ రెండు బైక్​ల మీద కోడూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న ట్రాలీ లారీ సరిగ్గా అనంతరాజుపేట క్రాస్ రోడ్డు వద్దకు రాగేనే రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. అనంతరం లారీ ఆగకుండా వెళ్లిపోయింది.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుకవైపు కూర్చున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన ఇద్దరు వ్యక్తులు ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. గాయపడిన వారిని అంబులెన్స్ సాయంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details