ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'మౌలిక వసతులు కల్పిస్తేనే ఓటేస్తాం'- ఎన్నికలు బహిష్కరిస్తామంటున్న గిరిజనులు - ఓటు బహిష్కరిస్తామన్న గిరిజనులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 12:00 PM IST

Tribals Expulsion Their Vote In Alluri District : అల్లూరి జిల్లా హుకుంపేట మండలం గాలిపాడులో ఎన్నికలు బహిష్కరిస్తామని గిరిజనులు హెచ్చరించారు. ఎన్నో ఏళ్లగా రహదారి సౌకర్యం లేక అంబులెన్సులు రాక అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచి నీళ్ల సౌకర్యం కూడా లేకుండా గడుపుతున్నామని గిరిజనులు వాపోయారు. తమ గ్రామానికి రహదారులు, తాగు నీటి సౌకర్యం కల్పిస్తేనే ఓటు వేస్తామని లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ ఈరు ఊరంతా తాము ఓటు వేయమంటూ గళమెత్తారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా వారు తమ గ్రామాన్ని ఏ అధికారి పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక వసతులైనా కల్పించకుండా అధికారులు మిన్నకుండి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్​ రెడ్డిని మా ఊరి రోడ్డును ఒకసాకరి చూడమనండి అంటూ ధ్వజమెత్తారు. ఏదేమైనప్పటి ఊరంతా ఒకే మాటగా గ్రామంలో కనీస సౌకర్యాలు అందిస్తేనే ఓటు వేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details