ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్సీపీ తెచ్చిన జీవో 117ను వెంటనే రద్దు చేయాలి- ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్​ - Teacher Leaders Meet Officials

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 4:30 PM IST

Teacher Union Leaders Meet Education Commissioner (ETV Bharat)

Teacher Union Leaders Meet The Education Officials : విద్యాశాఖలో పని సర్దుబాటు పేరుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 117ను వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజును డిమాండ్​ చేశారు. పాఠశాలలో సమస్యలపై మంగళగిరిలోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో విజయరామరాజు సమావేశం అయ్యారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సుమారు 21 సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. 

పని సర్దుబాటు పేరుతో గత ప్రభుత్వం ఉపాధ్యాయులను పలు రకాలుగా వేధించిందని సంఘాల నేతలు కమిషనర్​కు విన్నవించారు. ఉపాధ్యాయుల సర్దుబాటును యాజమాన్యాల కిందే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. 75% అంగవైకల్యం ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వచ్చే ఏడాది మే 31న ఉద్యోగ విరమణ చేసేవారిని పని సర్దుబాటు విధానం నుంచి తప్పించాలని కోరగా, కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఉపాధ్యాయ సంఘం నేతలు చెప్పారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details