ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు - రాచమల్లుకు టికెట్​ ఇస్తే ఓటమే: శివచంద్రా రెడ్డి - Proddatur YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 4:54 PM IST

Siva Chandra Reddy allegations on MLA Rachamallu: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి తానేనంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రచారం చేసుకోవడం విడ్డురంగా ఉందని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివచంద్రా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థి మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. సర్వే నిర్వహిస్తే పరిస్థితి స్పష్టం అవుతుందన్నారు. 

తనను ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వార్డు నెంబర్లను ఎమ్మెల్యే రాచమల్లు ప్రలోభ పెట్టారని శివచంద్రారెడ్డి ఆరోపించారు. గతంలో తాను గెలిపించుకున్న వార్డు మెంబర్లను సంతలో పశువులను కొన్నట్లు, ఒక్కరికి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి కొనుగొలు చేశారని ఆరోపించారు.  ప్రొద్దుటూరు ప్రజలు మార్పు కోరుతున్నారని తెలిపారు. మళ్లీ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను మెుదటి నుంచి  వైఎస్సార్సీపీతోనే ఉన్నామని తెలిపారు. ప్రొద్దుటూరులో వైఎస్ కుటుంబం నుంచి ఎవ్వరు పోటీ చేసినా పర్వాలేదని, లేకపోతే తనకే టికెట్ ఇవ్వాలని శివచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details