ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజమహేంద్రవరంలో టీడీపీ గెలుపు ఖాయం - ముఖాముఖిలో ఆదిరెడ్డి వాసు - adireddy vasu interview - ADIREDDY VASU INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 12:40 PM IST

TDP Candidate Adireddy Vasu Interview: రాజమహేంద్రవరం అర్బన్​లో మరోసారి తెలుగుదేశం పాగా వేయడం ఖాయమని యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో నగరంలో పేదలకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయలేదని, యువతకు ఉపాధి కరవైందని అన్నారు. చారిత్రక నగరం రాజమహేంద్రవరాన్ని బ్లేడ్ బ్యాచ్​లకు అడ్డాగా వైఎస్సార్సీపీ మార్చిందని వాసు అన్నారు. మహిళలు రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆదిరెడ్డి వాసు తెలిపారు. 

వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి లేదని, అయిదేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కున్నారని విమర్శించారు. అయిదేళ్లుగా ప్రజలు చాలా కష్టాలు పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటున్న ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details