ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో రూ.500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా - కలెక్టర్​కు జనసేన నేత పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Peethala Murthy Yadav Complaint on Govt Land Grab in Visakha: విశాఖ నగరం చిన్నగదిలిలో వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్​కు మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను కోరారు. చిన్నగదిలిలోని సర్వే నెం-13,21&26లోని 7.95 ఎకరాల భూమి సుమారు 500 కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని విశాఖ డైరీ యాజమాన్యం కబ్జా చేసిందని వివరించారు. రైతుల పేరు మీద చేసిన ఈ అక్రమాలపై విచారణ త్వరితగతిన జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయని కలెక్టర్​కు మూర్తి యాదవ్ వివరించారు. అలాగే జగన్ హయాంలో వైఎస్సార్​సీపీ నేతలు విశాఖను దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా కబ్జా చేశారని అన్నారు. వారి అరాచకాలను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని మూర్తి యాదవ్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details