ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రైల్వేజోన్​ శంకుస్థాపనకు ప్రధాని వస్తారని ఆశిస్తున్నాం: రామ్మోహన్​నాయుడు - Minister Rammohan Naidu Exclusive - MINISTER RAMMOHAN NAIDU EXCLUSIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 4:30 PM IST

Minister Rammohan Naidu Exclusive Interview About Trains : జూన్‌ 2026 నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టులో తొలి విమానం గాల్లోకి ఎగరాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఇవాళ వందేభారత్‌లో అభిమానులతో కలిసి ప్రయాణించారు. ఒక్కప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణమంటే ఇబ్బందులు ఉండేవని అలాంటిది నేడు ఉత్తరాంధ్రలో అత్యున్నత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్​లు నాలుగు నడుస్తున్నట్లు తెలిపారు. 

ఒక్కప్పడు ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణమంటే చాలా ఇబ్బందులు ఉండేవి. అలాంటిది ఇప్పుడు దేశంలోనే అత్యున్నత వందేభారత్ ఎక్స్​ప్రెస్​ రైళ్లు నాలుగు నడుస్తున్నాయని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వాసులకు అత్యున్నత రైలు​ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురాగలగడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. త్వరలోనే విశాఖ రైల్వే జోన్‌కు భూమి పూజ జరుగుతుందని, ప్రధాని సైతం ఆ వేడుకలో పాల్గొనాలని ఆశిస్తున్నామంటున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడితో ఈటీవీ ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details