ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కొత్త శోభ సంతరించుకున్న తిరుగిరులు - కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం - KAPILA THEERTHAM WATERFALLS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2024, 7:53 PM IST

Kapila Theertham Waterfalls: తిరుమల గిరులు సరికొత్త శోభ సంతరించుకొన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా పొంగి పొర్లుతోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. ఏడుకొండల్లో పరచుకొన్న పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాల అందాలు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలు ప్రధాన నిండు కుండను తలపిస్తున్నాయి. గోగర్భం జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండాయి. అదే విధంగా వర్షం కారణంగా తిరుగిరుల్లో దట్టమైన పొగమంచు ఏర్పడటంతో భక్తులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details