ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద బాధితులకు హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పరామర్శ- 'అమ్మ ప్రేమ' వృద్ధాశ్రమానికి ఆర్థిక చేయూత - Hero Sai Dharam Tej at Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 3:37 PM IST

Hero Sai Dharam Tej Visits Flood Victims (ETV Bharat)

Hero Sai Dharam Tej Visits Flood Victims : విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ పరామర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆశ్రమంలో వరద బాధిత వృద్ధుల సహాయార్థం 2 లక్షల రూపాయల చెక్కును అందించారు. బాధితులను పరామర్శించడానికే విజయవాడకు వచ్చానని తెలిపారు. వరద ముప్పు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను దర్శించుకుని ప్రార్థించానన్నారు. తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని తెలిపారు. 

ఆపత్కాలంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ స్పందన బాగుందని తెలిపారు. ప్రభుత్వం తగు రీతిలో స్పందిస్తున్నందుకే వరద ముప్పు నుంచి అం అందరూ త్వరగా కొలుకుంటున్నారని తెలిపారు. వాంబే కాలనీలో ఉన్న అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంతో తనకు విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు. తనకు ప్రమాదం జరిగినప్పుడు త్వరగా కోలుకోవాలని వృద్ధులంతా ప్రార్థనలు చేశారని గుర్తుచేశారు. వృద్ధాశ్రమం అభివృద్ధికి సైతం తాను సహకరిస్తానన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులను ఆదుకోవడంలో ఏ విధంగా స్పందిస్తున్నారో అందరికీ తెలుసున్నారు. ఆయనపై విమర్శలు చేసేవాళ్ల గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details