జీతాలు లేక కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కాంట్రాక్టు ఉద్యోగి - CONTRACT EMPLOYEE SUICIDE ATTEMPT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 8:00 PM IST
A Employee Suicide Attempt in Eluru : ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఓ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించడం కలకలం రేపింది. ఆరోగ్యశ్రీ విభాగంలో ఎంఎన్ఓగా దుర్గారావుకు పనిచేస్తున్నారు. ఆయనకు ఐదునెలలుగా జీతాలు అందడం లేదు. దీనికి తోడూ కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. ఇటు జీతం రాక అంటు అప్పులిచ్చిన వారి బాధలు తాళలేక పురుగుల మందు, పెట్రోల్తో ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు.
ఇది గమనించిన సిబ్బంది దుర్గారావును వారి కుటుంబ సభ్యులను అడ్డుకున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, సమస్యను పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీతం చెల్లించాలని కోరారు. తనతో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో 24 మంది సిబ్బందికి జీతాలు నిలిపివేశారని బాధితుడు వాపోయారు. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు వారం రోజుల్లో దుర్గారావుకు జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనతో ఆసుపత్రిలో కాసేపు గందరగోళం నెలకొంది.