రాజశేఖర్రెడ్డి అసలైన ప్రజా నాయకుడు - ఆయన స్ఫూర్తితోనే జోడో యాత్ర: రాహుల్ - rahul gandhi Released Video on YSR - RAHUL GANDHI RELEASED VIDEO ON YSR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 4:02 PM IST
Rahul Gandhi Released Video on YSR: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అసలైన ప్రజా నాయకుడు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాహుల్, ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్సార్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బతికిన నాయకుడు రాజశేఖర్రెడ్డి అని రాహుల్ గాంధీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతికి వైఎస్సార్ ఎంతో అంకితభావం, నిబద్ధతతో పనిచేశారని పేర్కొన్నారు. ఆయన బతికి ఉంటే ఏపీ ముఖచిత్రం మరోలా ఉండేదన్నారు. రాజశేఖర్ రెడ్డిని కోల్పోవడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావని తెలిపారు. రాజశేఖర్రెడ్డి వారసత్వాన్ని షర్మిల ముందుకు తీసుకెళ్లగలరని రాహుల్ గాంధీ అన్నారు. షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి నుంచి వ్యక్తిగతంగా తాను ఎంతగానో నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్ జోడో యాత్రకు వైఎస్సార్ పాదయాత్రే స్ఫూర్తి అని రాహుల్ గాంధీ తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన వీడియోలు చూసి తాను చాలా నేర్చుకున్నానన్నారు.