ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: పలమనేరులో చంద్రబాబు 'ప్రజాగళం' ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం - Chandrababu Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 12:22 PM IST

Updated : Mar 27, 2024, 1:24 PM IST

Chandrababu Election Campaign Live: పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నేటి నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నికలకు 50 రోజులే సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచనున్నారు. 'ప్రజాగళం'  పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాకా ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు.నేడు పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం కానున్నాయి. 'ప్రజాగళం' పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, రా కదలి రా పేరిట రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు నేటి నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించనున్నారు. తొలిరోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో చంద్రబాబు 'ప్రజాగళం' ఎన్నికల ప్రచారం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Mar 27, 2024, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details