ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"దర్గయ్యా ఎంతపని చేశావయ్యా"- భార్యను చూసేందుకు వెళ్లడానికి బస్సునే కొట్టేశాడు - Bus Robbery

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 12:47 PM IST

One Person Robbery For Bus (ETV Bharat)

Bus Robbery For Wife in Atmakur : పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సునే చోరీ చేసిన సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కృష్ణాపురానికి చెందిన దరగయ్య లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. దరగయ్య భార్య పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలోని పుట్టింటికి వెళ్లారు. పుట్టింటికి వెళ్లిన భార్యను చూడాలని ముచ్చుమర్రి వెళ్లేందుకు ఆత్మకూరు బస్టాండుకు వచ్చిన దరగయ్యకు అక్కడ బస్సులు ఏమి లేకపోవడంతో బస్టాండు నుంచి బయటికొచ్చాడు. 

పట్టణ శివారులో ఆగి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును దరగయ్య గమనించి అందులోకి ఎక్కాడు. తాళాలు కోసం చూడగా అక్కడే ఉండటంతో బస్సు తీసుకొని ముచ్చుమర్రికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బస్సు కనిపించకపోవడంతో చోరీ అయినట్లు గుర్తించిన డ్రైవర్ యజమాని హరికృష్ణకు సమచారం ఇచ్చాడు. బస్సు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా బస్సు పగిడ్యాల వైపు వెళుతున్నట్లు సిబ్బంది తెలుసుకున్నారు. దీంతో దరగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సును యజమానికి అప్పగించారు. 

ABOUT THE AUTHOR

...view details