కోనసీమ టూ ఒడిశా - కారులో 397 తాబేళ్లు.. అధికారులను చూసి నిందితుల పరారు - 397 Tortoise Illegal Transport
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 3:38 PM IST
₹3 Lakhs Worth 397 Tortoise Illegal Transport in konaseema District : వన్య ప్రాణుల అక్రమ రవాణా, వాటిని చంపడం నేరం అని తెలిసినప్పటకీ మూగ జీవుల అక్రమ రవాణాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి అమానుష ఘటనలు చాపకింద నీరులా పెచ్చుమీరుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం పోక్స్ పేట అటవీ తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న 397 తాబేళ్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కోనసీమ జిల్లా నుంచి కారులో ఒడిశాకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు తాబేళ్లను తరలిస్తున్న కారును అక్కడే వదిలేసి పరారయినట్లు అటవీ శాఖ అధికారులప పేర్కొన్నారు. అనంతరం అధికారులు కారును సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన తాబేళ్ల విలువ 3 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. వాటిలో 30 తాబేలు చనిపోయాయని, మిగిలిన తాబేళ్లను గోదావరిలో వదిలి పెడుతున్నట్లు అధికారులు తెలిపారు.