ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహాలక్ష్మీ స్కీమ్ ఎఫెక్ట్ - టీఎస్​ఆర్టీసీలో భారీగా తగ్గిన బస్ పాసులు - Bus Passes Decreased In TSRTC - BUS PASSES DECREASED IN TSRTC

RTC Bus Passes Decreased In Telangana: టీఎస్​ఆర్టీసీ బస్‌పాస్‌లు భారీ సంఖ్యలో తగ్గిపోయాయి. మహాలక్ష్మి పథకం ద్వారా హైదరాబాద్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, బస్‌పాస్‌లు అంతే సంఖ్యలో తగ్గిపోయాయి. ప్రయాణికులు పెరిగినప్పటికీ పాస్​లు ఎందుకు తగ్గాయి? పాస్​ల పునరుద్ధరణపై అధికారులు ఏవిధంగా ముందుకెళుతున్నారు? తదితర అంశాలపై ప్రత్యేక కథనం.

bus_passes_decreased_in_tsrtc
bus_passes_decreased_in_tsrtc

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 6:53 PM IST

మహాలక్ష్మీ స్కీమ్ ఎఫెక్ట్ - టీఎస్​ఆర్టీసీలో భారీగా తగ్గిన బస్ పాసులు

RTC Bus Passes Decreased In Telangana:గతంలో తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో 11 లక్షల మంది ప్రయాణిస్తే, ప్రస్తుతం ఆ సంఖ్య 21 లక్షలకు చేరింది. ఇది సంస్థకు సంతోషకరమైన విషయమే. అయినా బస్‌పాస్‌లు మాత్రం 40 శాతం తగ్గినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నగరంలో గత 3 నెలలుగా ఈ తగ్గుదల కనిపించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం పథకం అందుబాటులోకి వచ్చింది.

దీని ద్వారా మహిళలకు నగరంలో తిరిగే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఫలితంగా ప్రయాణికులు భారీగా పెరిగారు. అదే సమయంలో పాస్‌లు మాత్రం భారీగా తగ్గాయి. రాష్ట్ర నలుమూలలకు చెందిన వారు హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు ఉద్యోగ అవకాశాల కోసం, మరికొందరు చదువుకునేందుకు నగరంలో ఉంటారు. ఇక్కడకు వచ్చిన చాలా మంది ప్రజారవాణాపైనే ఆధారపడతారు. నెలంతా ప్రయాణించేవారు బస్‌పాస్‌లు తీసుకుంటారు.

ఫ్లాట్ ఫామ్​పైకి దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు - తప్పిన పెను ప్రమాదం - RTC bus rams into platform

Bus Passes Decreased in TSRTC :నగరంలో ప్రస్తుతం విద్యార్థుల బస్‌పాస్‌లు లక్షా 60 వేలు, జనరల్‌ పాస్‌లు 90 వేలు, దివ్యాంగుల పాస్‌లు(Disabled Persons Bus Pass) 30 వేలు, ఎన్జీవో(NGO) పాస్‌లు 2 వేల వరకు ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో అన్ని రకాల పాస్‌లు కలిపి 2 లక్షల 82 వేలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో నగరంలో ఉండే అన్ని రకాల బస్ పాస్​లపై ప్రభావం పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో 7 లక్షలకు పైగా బస్ పాస్​లు ఉండేవి.

రాష్ట్రం విడిపోయిన తర్వాత బస్ పాస్​ల సంఖ్య 4.50 లక్షలకు పడిపోయాయి. కరోనా సమయంలో కొంతకాలం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో కరోనా తర్వాత బస్ పాస్​లు 3.9 లక్షల వరకు తగ్గిపోయాయి. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Bus Scheme) అమలు తర్వాత బస్ పాస్​ల సంఖ్య 2.82 లక్షలకు పడిపోయినట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో ప్రస్తుతం 2 వేల 850 బస్సులు తిరుగుతున్నాయి.

సామాన్యులకు శాపంగా జగన్ సభలు - బస్సుల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూపులు - Problems with Jagan bus yatra

కానీ 7 వేల 500ల వరకు బస్సులు అవసరం అని ఆర్టీసీ నివేదికలు చెబుతున్నాయి. తిరిగి బస్సులు పెరిగితే మళ్లీ ప్రయాణికులతో పాటు పాస్‌లు పెరుగుతాయని ప్రజా రవాణా నిపుణులు పేర్కొంటున్నారు. బస్సులు తక్కువగా ఉండడంతో చాలామంది వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్నారు. దీంతో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైనట్లు తెలుస్తుంది.

ఆర్టీసీ రథ చక్రాలకు కళ్లెం వేసిన జగన్ సర్కార్ - వేగంగా ప్రైవేటు పరం! - Jagan destroyed RTC

ABOUT THE AUTHOR

...view details