AP Assembly Sessions 2025 :శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, సీఎస్ జయానంద్, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉదయం 9:30 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరవుతారని స్పీకర్ తెలిపారు.
శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇందుకు పోలీసుశాఖకు సహకరించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులు శాసనసభ ప్రాంగణంలో కాకుండా సీఎం కార్యాలయంలోనే భేటీ కావాలని సూచించారు.