ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరిచిన పెంపుడు కుక్క - తండ్రి, కుమారుడు మృతి - Son and Father Died in Dog Bite

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 11:15 AM IST

Updated : Jun 26, 2024, 1:29 PM IST

Son and Father Died in Dog Bite in Vishaka : ఓ కుటుంబం ఇంట్లో కుక్కను పెంచుకుంటోంది. వాళ్లు దానిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కానీ ఆ కుక్క చేతిలోనే తండ్రి, కుమారుడు బలైపోయారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.

Son and Father Died in Dog Bite in Vishaka
Son and Father Died in Dog Bite in Vishaka (ETV Bharat)

Son and Father Died in Dog Bite in Vishaka : కుక్క పేరు చెబితే విశ్వాసానికి ప్రతీక అని అంటారు. పెంపుడు కుక్కలు ఇంటిని సురక్షితంగా కాపాడటమే కాదు, బోలెడు కాలక్షేపాన్ని పంచుతాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. రౌడీలు, గుండాల కన్నా, వీధి కుక్కలను చూస్తేనే ఇప్పుడు జనం ఎక్కువ భయపడిపోతున్నారు. కొన్ని కాలనీల్లో ఐతే ఇళ్లల్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు. వీధి కుక్కలతో సమానంగా పెంపుడు కుక్కలు సైతం మరణానికి కారణమవుతున్నాయి.

వీధి కుక్కలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని కాలనీల్లో ఐతే ఇళ్లల్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట శునకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మే నెలలో పెంపుడు కుక్క దాడిలో ఓ 5 నెలల పసికందు మృతి చెందిన ఘటన తెలంగాణలోని వికారాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనే విశాఖ జిల్లాలో చోటు చోసుకుంది. పెంపుడు కుక్క కాటులో తండ్రి, కుమారుడు మృతి కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే

పెంపుడు కుక్కలతోనూ జాగ్రత్త!- రేబిస్​ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! - Dog Bite Treatment in Telugu

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ ఎగువుపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సరదా కోసం పెంచుకున్న కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందిన సంఘటనతో ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను గాయపర్చిన కుక్క రెండు రోజులకే మృతి చెందడంతో భీమిలి ప్రభుత్వాసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మృతిని బంధువులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం భీమిలి జోన్ ఎగువపేటలో మత్స్యకార కుటుంబానికి చెందిన అల్లిపల్లి నర్సింగరావు(59), అల్లిపల్లి చంద్రావతి(57), కుమారుడు భార్గవ్(27) తో నివాసముంటున్నారు. వీరు సరదా కోసం కుక్కను పెంచుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం కుటుంబ యజమాని అల్లిపల్లి నర్సింగ్ రావు, భార్య చంద్రావతి కుమారుడు భార్గవ్​ను పెంచుకున్న కుక్క గాయపరిచింది. గాయపరిచిన కుక్క రెండు రోజుల్లోనే మృతి చెందడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు. గత రెండేళ్లుగా కుటుంబ యజమాని అల్లిపల్లి నర్సింగరావు పక్షవాతంతో బాధపడుతున్నాడు. కేజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో అల్లిపెల్లి భార్గవ్ గత నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. మంగళవారం కుటుంబ యజమాని కూడా మృతి చెందడంతో ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుక్క గాయపరిచిన మూడో వ్యక్తి చంద్రావతి ప్రస్తుతం ఆరోగ్యం గానే ఉందని వైద్యులు తెలిపారు.

తొలిసారి కుక్కను పెంచుతున్నారా? - ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే! - Pet Care Tips For Beginners

ఈ సందర్భంగా మృతుల కుటుంబాన్ని భీమిలి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ కల్యాణ్ చక్రవర్తి పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం మృతి చెందిన భార్గవ్, తల్లి చంద్రావతి మా హాస్పిటల్లోనే మే 31న వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. తండ్రి నరసింగరావు మాత్రం గత రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారన్నారని, దీంతోనే ఆయన మృతి చెందాడని అన్నారు. తల్లి కొడుకు మొదటి డోస్ మాత్రమే వేయించుకున్నారని, మిగతా డోస్​లు వేయించుకోకపోవడంతోనే భార్గవ్ మృతి చెందాడన్నారు. తల్లి చంద్రావతి ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.

మీ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!

Last Updated : Jun 26, 2024, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details