Officers Collecting Money From New Teachers : కొత్తగా టీచర్ జాబ్లో చేరిన వారికి జీతం అందాలంటే రూ.2వేలు లంచం ఇవ్వాల్సిందేనా? నగదు ఇచ్చేందుకు ఇబ్బంది అనుకుంటే గూగుల్ ఫే, ఫోన్ ఫే ద్వారా ఇవ్వాలంటూ డైరెక్టుగానే చెప్తున్న పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. కిందిస్థాయి సిబ్బంది ఇలా డిమాండ్ చేయడం ఇబ్బందికరంగా మారిందని సదరు ఉపాధ్యాయులు వాపోతున్నారు. మండలాల వారీగా విధులు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారుల్లో కొంత మంది పరోక్షంగా ఈ బలవంతపు వసూళ్లు ప్రోత్సహిస్తున్నందుకే కొత్త టీచర్లు మౌనం పాటిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
జగన్ అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్! - అవినీతిలో తగ్గేదేలే
లంచం.. లంచం.. లంచం : హైదరాబాద్లో 680 మంది ఉపాధ్యాయులు కొత్తగా విధుల్లో చేరారు. నవంబరు నెల జీతం డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. అయితే పాఠశాలల వారీగా వారిని గుర్తించి నెల జీతం రావాలలంటే లంచం ఇవ్వాలని నవంబరు రెండోవారంలో వారికి చెప్పారు. ఈ నెల 24లోపు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యతను ఇద్దరు వ్యక్తులకు ముట్టజెప్పారు. అన్ని మండలాల్లో ఈ వసూళ్లు జరుగుతున్నా మా వద్ద ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని అధికారులు బుకాయిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓ మండల విద్యాధికారిని దీనిపై ప్రశ్నించగా తాము పైసలు వసూలు చేయడం లేదని తెలిపారు.