Rajvihar Junction Bus Stand Closed Six Months Ago for Repairs :వివిధ ప్రాంతాలకు వెళ్లే వందలాది బస్సులు ఆ మార్గం మీదుగానే వెళ్తుంటాయి. కానీ గతంలో అక్కడ ఏర్పాటు చేసిన బస్టాండు మూతపడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు నగరంలో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన రాజ్విహార్ బస్టాండ్ను మరమ్మతుల పేరుతో మూసేశారు. నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి.
సరిగ్గా ఎన్నికల కోడ్ అమలు ముందు పని ప్రారంభించినట్టు చేసి, ఎందరికో నీడనిచ్చే బస్టాండ్ను మరమ్మతుల పేరుతో మూసేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార నేతల మాటలు కోటలు దాటినా పని మాత్రం జరగడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
'కర్నూలులోని రాజ్విహార్ కూడలిలో ఉన్న బస్టాండు. మరమ్మతుల పేరుతో ఆరు నెలల క్రితం మూసేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులన్నీ రాజ్ విహార్ మీదుగానే వెళ్తుంటాయి. బస్టాండు లేకుండా చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కోడ్కు ముందే ఆగిపోయిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు, స్థానికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది.'- ప్రయాణికులు